(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రావులపాలెం సమీపంలో రావులపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మృతులు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ వైపు వెళుతున్న కారు డివైడర్ దాటి అవతల వైపు నుండి వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జు కాగా ఓ కారు ఇంజన్ ఊడి బయటకు వచ్చేసింది.