ఎస్.ఎస్.రాజమౌళి.. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శక ధీరుడు. ‘బాహుబలి’ ఫ్రాంఛైజీ తో తెలుగు సినిమా స్థాయిని ఆకాశంలో ఉంచాడు. రాజమౌళి లాంటి దర్శకుడు ప్రతీ సినిమా ఇండస్ట్రీలో ఒక్కరైనా ఉండాలని అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఇక ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ వచ్చిందంటే అందుకు కారణం రాజమౌళి నే. అందుకే ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి లాంటి దర్శకుడు ఇంకొకరు తయారవడం చాలా కష్టమని భావించారు.
ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. టాలీవుడ్ లో స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కిస్తున్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఇప్పుడు రాజమౌళి కి ఆయన సినిమాలకి గట్టి పోటీ ఇచ్చే దర్శకులు తయారయ్యారు. అదే రేంజ్ లో సినిమాలను తెరకెక్కించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నలుగురు నాలుగు వైపుల నుంచి దూసుకొస్తున్నారని చెప్పాలి.
లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అన్న పాన్ ఇండియన్ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాకపోయినా 220 కోట్ల గ్రాస్ వరకూ వసూళ్ళు సాధించి రికార్డ్ క్రియోట్ చేసింది. ఇక అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందుకు కారణం అల్లు అర్జున్ కి మలయాళం, హిందీ భాషలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రకంగా రాజమౌళి సుకుమార్ పోటీ కాబోతున్నాడు.
ఇక ‘కె.జి.ఎఫ్’ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ సక్సస్ ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘కె.జి.ఎఫ్2’ తో పాటు.. ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలు సక్సస్ అయితే రాజమౌళి కి పోటీగా నిలబడ్డట్టే.
ఇక నాని, విజయ్ దేవరకొండ లతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్ హిట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత మహానటి సినిమాతో అద్భుతమైన సక్సస్ ని అందుకున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ 50 వ సినిమాగా ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రకంగా నాగ్ అశ్విన్ రాజమౌళి కి పోటీ కాబోతున్నాడు.
ఇక మరాఠిలో ‘లోకమాన్య : ఏక్ యుగ పురుష్’ సినిమాని తెరకెక్కించి ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకున్న దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా తరువాత అజయ్ దేవగన్ తో ‘తానాజీ’ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లతో ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే ఓం రౌత్ కూడా రాజమౌళికి పోటీకావచ్చన్న మాట వినిపిస్తుంది. మొత్తానికి దర్శక ధీరుడుకి పాన్ ఇండియన్ లెవల్లో దర్శకులు బాగానే తయారవుతున్నారు. అయితే ఎంతమంది వచ్చిన రాజమౌళి మార్క్ ని టచ్ చేయడం అసాధ్యం అని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!