ఒడిశా రాష్ట్రంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమగిరి సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జీపు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మయూర్బంజ్ జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పండాపాడా పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.