Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసుల దుర్మరణం చెందటం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ దేవి జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏఆర్ కానిస్టేబుల్ బృందం బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిని ఈ వాహనం క్రాస్ చేస్తుండగా.. లారీ గట్టిగా ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. విషయం తెలుసుకున్న పై అధికారులు వెంటనే ఘటనా స్థలానికి.. పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన మరికొంత మంది పోలీసులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతి వేగంతో లారీ రావడంతో డ్రైవర్ అదుపు చేయలేక… పోలీసులు క్రాస్ చేస్తున్న బోలేరో వాహనాన్ని డీ కొన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?