శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని హంద్వారా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వరకూ ఈ ఎన్కౌంటర్లలో నలుగురు భధ్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు.
మృతి చెందిన వారిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు ఉన్నారు.
బాబాగుండ్ గ్రామంలో ఒక నివాస గృహంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. అక్కడ ఎంత మంది ఉగ్రవాదులు దాక్కుకున్నారన్న సమాచారంపై స్పష్టత లేదు. గత మూడు రోజులుగా కుప్వారా ప్రాంతంలో సోదాలు జరుగుతునే ఉన్నాయి.
భద్రతాదళాలు, ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లను ఆశ్రయిస్తున్నారు.