NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త

ఉచిత పంపిణీలు అంటే ఎక్కడైనా ఎగబడటం పరిపాటిగా మారింది. క్రమ పద్దతి పాటించడం, క్రమశిక్షణగా నడుచుకోవడం చేయరు. ఆ ఉచిత వస్తువు అందుకోవాలన్న ఆరాటంలో అపస్తృతులు చోటుచేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. గత నెలలో గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. అటువంటి ఘటనే తమిళనాడులోనూ జరిగింది. అక్కడి ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, మరో డజను మంది గాయపడ్డారు.

Guntur Seen Repeat In Tamilnadu

 

తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయ్యప్పన్ బ్లూమెటల్ సంస్థ నిర్వహకుడు అయ్యప్పన్ గత కొన్ని సంవత్సరాలుగా తైపూస ఉత్సవాల సందర్భంగా ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ఆనవాయితీ మేరకు ఆదివారం వేడుక నేపథ్యంలో శనివారం ఉచిత చీరెల పంపిణీకి టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు సుమారు రెండు వేల మంది తరలివచ్చారు. సంస్థ తలుపులు తెరిచిన వెంటనే పెద్ద ఎత్తున మహిళలు లోపలకు ప్రవేశించే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కరుంబట్టి ప్రాంతానికి చెందిన వళ్లియమ్మాళ్ (60), ఉచ్చంబట్టుకు చెందిన నాగమ్మాళ్ (60), అరపాండై కుప్పం వాసి రాజాత్తి (60), వానియంబాడికి చెందిన మల్లిక (65) మృతి చెందారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వహకుడు అయ్యప్పన్ ను అరెస్టు చేశారు.  గుంటూరులోనూ చీరల పంపిణీ చేసిన స్వచ్చంద సంస్థ నిర్వహకుడు, ఎన్ఆర్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక్కడ తమిళనాడులోనూ నిర్వహకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటువంటి తరహా దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే ఉచిత వస్తువులు పంపిణీలు చేసే నిర్వహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పుట పోలీస్ పర్మిషన్, బందోబస్తు లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి దుర్ఘటనల వల్ల పేద ప్రజలకు ఏదో విధంగా వారికి చేతనైనంత సాయం చేయాలని ముందుకు వచ్చే వారు వెనుకాడే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు కూడా సంయమనం పాటించడం అలవర్చుకోవాలి.

సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ సర్కార్ కీలక లేఖ

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!