2018 అక్టోబర్లో గుజరాత్లోని నర్మద జిల్లాలో నెలకొల్పిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహంసి అతి తక్కువ సమయంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ టిక్కెట్ల విషయంలో భారీ మోసం జరిగింది.
ఈ వ్యవహారంపై పోలీసులు ఓ బ్యాంకు నుంచి ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ యాజమాన్యం దాదాపు ఏడాదిన్నర నుంచి టిక్కెట్లు విక్రయించే బాధ్యతను కేవడియాలోని ఓ క్యాష్ కలెక్షన్ ఏజెన్సీకి అప్పగించింది. అప్పటి నుంచి వడోదరలోని ఓ ప్రయివేటు బ్యాంకు పర్యవేక్షణలో ఈ ఏజెన్సీ టిక్కెట్లను విక్రయిస్తుంది.
అయితే ఈ ఏడాదిన్నరగా కొంతమంది ఏజెన్సీ సిబ్బంది దాదాపు రూ. 5.24 కోట్ల రూపాయలను స్టాట్యూ ఆఫ్ యూనిటీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయలేదు. దీనితో బ్యాంకు మేనేజర్ కేవడియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీలోని 420, 406, 120బి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బ్యాంకు మాత్రం తమ ఖాతాల్లో రూ.5.24 కోట్లు డిపాజిట్ చేసినట్టు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అధికారులు స్పష్టం చేశారు.