Sunitha: ఇటీవలే సింగర్ సునీత రామ్ వీరపనేని ని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వీరి వివాహం కేవలం సన్నిహితుల మధ్య జరిగినది. ఈ నిర్ణయం తీసుకునందుకు టాలీవుడ్ లోని ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. ఇకనైనా ఆమె తన జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకున్నారు..
అయితే సునీత కూడా ప్రజల నుంచి వచ్చిన పాజిటివ్ విషెస్ ను చూసి చాలా సంతోషాపడ్డారు. 19 ఏళ్లకే ఆమెకు వివాహం జరిగినది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత కొన్ని అభిప్రాయ బేధాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నుంచి తన పిల్లలతో ఆమె తన పుట్టింటిలోనే ఉన్నారు. ఆమె తన పిల్లలకోసం ఇన్నాళ్ళూ రెండో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు. ప్రస్తుతం సునీత తన పిల్లల ప్రోద్భలంతో ఈ రెండో పెళ్లి చేసుకున్నారని అర్ధమవుతుంది.
తాజాగా సునీత ఒక వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతునాయి. ఇప్పటివరకు కేవలం స్టార్ హీరోల పేర్లు మరియు స్టార్ హీరోయిన్ల పేర్లు వాడి ఫేక్ అక్కౌంట్లుఫేక్ అక్కౌంట్లుఫేక్ అక్కౌంట్లుఫేక్ అక్కౌంట్లు క్రియేట్ చేసి చాలా మంది చాలా మోసాలు చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి సింగర్ సునీత పేరు వాడుకుని కొన్ని లక్షల రూపాయలను అమాయకుల నుంచి రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ విషయమై సునీత స్పందిస్తూ అతడి వివరాలు తెలియజేశారు. “ఎవరో చైతన్య అనే ఒక వ్యక్తి అట, అతనిది అనంతపురం జిల్లా అట. అతడు ఎంతోమంది అమాయకులకు నా పేరు చెప్పి చాలా డబ్బులు దోచుకుంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని సునీత చెప్పుకొచ్చారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.