Thieves inspired from a movie: కాదేదీ కవితకు అనర్హం అని ప్రముఖ కవి శ్రీ శ్రీ చెప్పాడు. దానినే ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారు వీరు. అందుకోసమే ఏకంగా సీబీఐ అధికారులమని చెప్పి అమాయకులను మోసం చేశారు. కానీ పాపం పండింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
సినిమాలు చూస్తే సరి…
ఇతరులను ఎలా మోసం చేయాలో తెలియకపోతే మనం సినిమాలు చూస్తే సరిపోతుంది. ఎన్నో మోసాలు మనకు అచ్చం సినిమా రీతిలో కనిపిస్తాయి. ఇదే అందుకు నిదర్శనం. నేటి తరం సినిమాలు ప్రేక్షకులను ఎటువైపు తీసుకుపోతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో సేమ్ సూర్య నటించిన గ్యాంగ్ (Gang movie) అనే సినిమాలోని సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో కూడా సూర్య గ్యాంగ్ తాము సీబీఐ అధికారులమని చెప్పి అందర్నీ మోసం చేస్తుంటారు. కడపలో కూడా ఒక ముఠా అలాగే చేస్తూ పోలీసులకు చిక్కారు.
సీబీఐ అధికారులమంటూ.
కడప జిల్లాలో ఓ నలుగురు సభ్యుల ముఠా తాము సీబీఐ అధికారులమని చెప్పుకుని జనాలకు కుచ్చు టోపీ పెడుతున్నారని తెలుసుకున్న పోలీసులు వారి పని పట్టారు. పోయిన నెల 23న కడపలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని టార్గెట్ చేసిన ఈ నకిలీ ముఠా విచారణ పేరుతో ఉదయ్ కుమార్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అతడికి ఎన్ని ఆస్తులున్నాయని ఎంత ఖర్చు చేస్తున్నాడనే విషయాలను తెలుసుకుంటూ ఉదయ్ కుమార్ నుంచి 1.14 లక్షల రూపాయలను తీసుకున్నారు. ఇలా తీసుకున్నాక ఉదయ్ కుమార్ ను తర్వాత రోజు వదిలిపెట్టారు. కానీ ఎంత తప్పు చేసినా కానీ అది ఎంత తెలివితో చేసినా కానీ మన పాపం పండితే అదెలాగో బయటపడుతుంది. మన పని అవుతుంది. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. పోలీసులకు ఉదయ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసు వారు ఈ నకిలీ ముఠాను అరెస్ట్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?