కరోనా నుండి పూర్తి స్థాయి రక్షణ కోసం వినియోగిస్తున్న బూస్టర్ డోస్ ఉచిత పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేటు కేంద్రాల ద్వారా బుస్టర్ డోస్ పంపిణీ జరుగుతోంది. అయితే ఈ నెల 15వ తేదీ (శుక్రవారం) నుండి దేశ వ్యాప్తంగా బుస్టర్ డోస్ ఉచిత పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కరోనా ప్రికాషన్ డోస్ గా పిలుస్తున్న బూస్టర్ డోస్ ను శుక్రవారం నుండి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కల్గిన వారు అందరూ ఉచితంగా బూస్టర్ డోస్ ను అందించనున్నారు. నరేంద్ర మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న అజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఉచిత బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు.