Free Insurance offer : ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా మొత్తంలో ప్రీమియం (premium) చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల మరణాల రేటు గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల క్లెయిమ్స్ (insurance claims) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఇన్సూరెన్స్ కంపెనీలపై భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం ధరలు పెంచుతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీలు వెంటనే జారీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితులలో భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.50 లక్షల విలువైన ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. దాని వివరాలు తెలుసుకుందాం పదండి.
Free Insurance offer : ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)
భారత రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం యాజమాన్యంలో పనిచేసే ఐఆర్సీటీసీ (IRCTC) సంస్థ టిక్కెట్లు, క్యాటరింగ్, పర్యాటక సేవలను అందిస్తుంది. ఎక్కడ టిక్కెట్లు అంటే రైల్వే టికెట్లు మాత్రమే కాదు బస్సు టికెట్లు, విమాన టికెట్లు కూడా బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ ప్రజలను అనుమతిస్తుంది. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక్కో టికెట్ బుకింగ్ ఒక్కో వెబ్ పేజీ, ఒక్కో యాప్స్ ఏర్పాటు చేసింది. అయితే ఎవరైతే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో https://www.air.irctc.co.in/ లో విమాన టికెట్లు బుక్ చేసుకుంటారో వారికి ఏకంగా 50 లక్షల ఎయిర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మీరు టికెట్ బుక్ చేస్తే చాలు ఉచితంగా రూ.50 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పొందొచ్చు.
మరిన్ని ప్రయోజనాలివే
ఫ్లైట్ బుకింగ్ ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తోపాటు ఐఆర్సీటీసీ మరిన్ని ప్రయోజనాలు అందజేస్తోంది. కన్వీనియన్స్ ఫీజు కేవలం 59 రూపాయలుగా నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎల్టీసీ టికెట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్ ద్వారా 5% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మరిన్ని వివరాలకు మీరు అధికారిక వెబ్సైట్ https://www.air.irctc.co.in/ ని సందర్శించవచ్చు.
House sale offers : ఇల్లు కొనాలి అనుకుంటున్నారా;? ఈ బ్యాంకు ద్వారా చాలా చవకగా ఇల్లు కొనచ్చు..!