ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకుంటున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా ఈ పథకం వాయిదా పడుతూ వస్తోంది.
ఆగష్టు 15న ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రణాళికలు వేసుకుంది ప్రభుత్వం. అయితే కోర్టులో విచారణ కొనసాగుతుండడంతో తాజాగా అక్టోబర్ 2కు వాయిదా పడింది. ఈ కార్యక్రమం వాయిదా పాడడం ఇదేమి తొలిసారి కాదు. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున నిర్వహిద్దాం అనుకున్నారు. ఆ బీఆర్ అంబేడ్కర్ జయంతికి అనుకున్నా కుదర్లేదు. ఆపై జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిద్దామనుకున్నా ఇళ్ల స్థలాల సేకరణలో జాప్యం కారణంగా కుదర్లేదు. ఇక ఆగష్టు 15కు వాయిదా పడ్డ ఈ కార్యక్రమం ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.