.
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు సరఫరా చేసే పాల ప్యాకెట్లో కప్ప కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇంతకు ముందు గోరుముద్ద పథకం పురుగులు బయటపడిన విషయం మురవకముందే ఇప్పుడు పాల ప్యాకెట్లో కప్ప రావడం ఆందోళన కల్గిస్తుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వెలుగులోకి వచ్చింది.
గర్బిణిలు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణకు ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పాలతో సహా ఇతర పోషకాలను అందించే ఎండు కర్జూర, తదితర వస్తువులు అందిస్తుంటారు. అయితే అంగన్ వాడీ కేంద్రంలో ఒక మహిళకు ఇచ్చిన వజ్ర పాల ప్యాకెట్ ను ఆమె సీల్ తీసి వేడి చేయడానికి గిన్నెలో పోయగా కప్ప దర్శనమిచ్చింది. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని అంగన్వాడీకి తెలియజేసింది. పాల ప్యాకెట్లో కప్ప రావడం పట్ల ఇతర బాలింతలు, గర్బిణిలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచరణ జరుపుతున్నారు.