బ్యాంక్ అకౌంట్ ను ప్రతి ఒక్కరికి అవసరం. నెల జీతం తీసుకోవాలన్నా.. ఇతరులు పంపే డబ్బులను వాడుకోవాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాల్సిందే. అయితే బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నామా.. అయిపోయిందా అన్నట్లు కాకుండా బ్యాంకర్లు తీసుకొచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్లు తెలుసుకుంటే ఎన్నో ఉపయోగపడే విషయాలు తెలుస్తాయని పలువురు చెబుతుంటారు. ఇలా తెలుసుకోవడం వల్ల ఏం చేయాలి ఏం చేయొద్దో అనే విషయాలు తెలుస్తాయని చెబుతుంటారు.
అయితే బ్యాంకర్లు కొత్త రూల్ ఒక దాన్ని అములోకి తీసుకురాబోతున్నారు. దాంతో బ్యాంక్ ఖాతాదాలుకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఈ రూల్ డిసెంబర్ 1వ తేదినుంచి అమలులోకి రాబోతుంది. దీంతో రోజులో ఎప్పుడైనా ఆర్ టీజీఎస్ ద్వారా డబ్బులను పంపించే అవకాశం బ్యాంక్ ఖాతాదారులకు ఉంటుంది.
అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పోయిన యేడాది నెఫ్ట్ (NEFT) సేవలను రోజులో ఎప్పుడైనా వాడుకునేలా సదుపాయాన్ని కల్పించింది. ఇప్పుడు దాని మాదిరిగానే ఆర్ టీజీ ఎస్ సేవలను కూడా తీసుకురాబోతుంది. ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్లను గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంచేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్ ను తీసుకురాబోతుంది..
ఆర్ బీఐ ఇప్పటికే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్ టీజీఎస్) సేవలు ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇది డిసెంబర్ 1వ తేది నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగాత సమయాల్లో ఈ సేవలు ఉండవు. దాంతో మళ్లీ నెస్ట్ డే వరకు ఆగాల్సిందే. ఇప్పుడు దీన్ని ఆర్ బీఐ మార్చనుంది.
అయితే ఆర్టీజీఎస్ ద్వారా కస్టమర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులను వెంటనే వేరేవారికి పంపించే అవకాశం ఉంటుంది. అయితే దీని ద్వారా కనీసం రూ.2 లక్షలు పంపాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఈ డబ్బులు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. లేకుండా బ్యాంకుకు వెళితే చార్జీలు చెల్లించాలి. రూ.2 లక్షలకులోపు డబ్బులు పంపాల్సి వస్తే.. నెఫ్ట్ ను వాడుకోవచ్చు.