Fruits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. డాక్టర్లు కూడా ప్రతిరోజు ఏదో ఒక పండును కచ్చితంగా తినమని సూచిస్తారు.. అయితే పండ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని కొంతమందికి తెలుసు.. అలాగే కొన్ని పండ్లను కొన్ని రకాల పండ్ల తో కలిపి తీసుకోకూడదని ఎక్కువ మందికి తెలియదు.. ఏ పండ్లు ఏ పండ్లతో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!! ఇలా తీసుకోవడం వలన ఆరోగ్యానికి కలిగే నష్టం గురించి చర్చించుకుందాం..!!
Fruits: పొరపాటున ఈ పండ్లను కలిపి తినకండి..!!
పండులలో కొన్ని సహజ సిద్ధంగానే తీయదనాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పళ్లను కలిపి అస్సలు తీసుకోకూడదు. నేరేడు, దానిమ్మ పండ్లను కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తింటే కడుపు లో మంట, అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట వస్తుంది ఎందుకంటే ఈ రెండింటి లో చక్కెర ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందువలన మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది .జీర్ణం అవటానికి అవసరమైన ఎంజైమ్స్ ను కూడా నశింపజేస్తాయి.
పుచ్చకాయ, కర్బూజ కూడా కలిపి తినకూడదు. వీటి వలన కూడా అజీర్తి సమస్య వస్తుంది. అరటిపండును జామకాయను కలిపి తినటం ఆరోగ్యానికి ప్రమాదమని డైటీషియన్ నిపుణులు చెబుతున్నారు.ఈ రెండింటినీ కలిపి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలతో పాటు తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. బొప్పాయి పండు తో నిమ్మకాయ కలిపి తీసుకుంటే రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. దీని వలన రక్తహీనత ఏర్పడుతుంది.
Fruits: ఫ్రూట్స్ తో కలిపి ఈ కూరగాయలు తినవద్దు..!!
నారింజ కాయ క్యారెట్ ను కలిపి తినకూడదు. ఇది శరీరంలో మూత్రపిండ సమస్యలకు కారణం అవుతుంది. గుండెల్లో మంట వస్తుంది. భోజనం చేసిన వెంటనే పండ్లను తినకూడదు కనీసం ఒక గంట అయినా తర్వాత తీసుకోవాలి. పెరుగు తో కలిపి పుల్లని పండ్లను కలిపి తీసుకోకూడదు. సిట్రస్ పండ్లను పెరుగు తో కలిపి తీసుకోవడం వలన ఉదర సమస్యలు బాధిస్తాయి.
Fruits: పండ్లతో కలిపి ఈ ఆహార పదార్థాలు తినకూడదు..!!
అరటి పండును పాయసం తో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన శరీరం లో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన పొట్ట బరువుగా అనిపిస్తుంది. పనస పండు ను పాలతో కలిపి తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పైన చెప్పుకున్న విధంగా ఆ రకమైన ఫ్రూట్ కాంబినేషన్స్ ను తీసుకోకండి. విడి విడిగా పండ్లను తినడమే ఆరోగ్యానికి మంచిది. అలా తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఒక పండు తిన్న తర్వాత కనీసం గంట గ్యాప్ ఇచ్చి మరో రకం పండును తీసుకుంటే మంచిది.