పండ్లు మరియు కూరగాయలను మనం ముందుగా శుభ్రంగా కడిగి తింటాం. తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచి పద్ధతే. పొలాలలో తెగులు వల్ల వచ్చే పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు మరియు కూరగాయల పంటలకు రసాయనాలతో కూడిన పురుగుమందులను పిచికారీ చేస్తారు. కాబట్టి మనం తినే ప్రతి పండు మరియు కూరగాయ రసాయనాలతో నియండి ఉంటుంది. వీటిని శుభ్రపరచకుండా తీసుకుంటే ఆరసాయనాలు మన శరీరంలోకి వెళ్ళి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వీటికి తోడు తాజాగా కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. ఈ కరోనా వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది.
కరోనావైరస్ వ్యాపిస్తున్న తరుణంలో కూరగాయలు మరియు పండ్లను శుభ్రపరచడం ఓ సవాలుగా మారింది. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు మరియు నిబంధనలను విదించింది. పండ్లు, కూరగాయల ద్వారా కరోనావైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి తగు సూచనలను తెలిపింది.
అమ్మకందారుల నుండి మనం కొన్నపండ్లు మరియు కూరగాయలను వారి ప్యాకేజింగ్లోనే ఇంటి ప్రాంగణంలో ఓ మూలలో కొంతసేపు ఉంచమని చెబుతున్నారు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కూరగాయలను బాగా కడగి శుభ్రంచేయ్యాలి లేదా 50-PPM క్లోరిన్ చుక్కలను గోరువెచ్చని నీటిలో వేసి, ఆ ద్రవం లో ఉత్పత్తులను కొంతసేపు ఉంచవచ్చు.
రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన కూరగాయలు మరియు పండ్లను అక్కడే నిల్వ ఉంచి ఇతర ఉత్పత్తులను గది ఉష్ణోగ్రత వద్ద ర్యాకుల్లో కానీ బుట్టల్లో ఉంచాలని FSSAI తెలిపింది. కూరగాయలు మరియు పండ్లను కడగడానికి ఉపయోగించే కిచెన్ లోని సింక్ మరియు ప్లాట్ఫాంను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.