హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు పల్టీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది,మరో ఎనిమిది మంది గాయపడ్డారు.క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. ఆటో కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు పడటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.కారు పై నుండి పల్టీ కొడుతూ కింద పడటంతో అక్కడ ఉన్న వారు పరుగులు తీశారు.ఈ ఘటనతో ఫ్లైఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.