(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యత్వానికి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. పొలిట్ బ్యూరోకి రాజీనామా చేస్తూ ఆమె చంద్రబాబుకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు గల్లా అరుణ కుమారి లేఖలో పేర్కొన్నారు.
గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారు. గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. సీనియర్ నాయకురాలైన ఆమెను టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడుగా టీడీపీలో చేరిన గల్లా జయదేవ్,, రెండు సార్లు గుంటూరు పార్లమెంట్ నుండి విజయం సాధించారు.