గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సొంత నాయకులే చంద్రబాబుకి ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దీంతో కొన ఊపిరితో ఉన్న ప్రతిపక్ష హోదా ఎప్పుడు పోతుందో అన్న టెన్షన్ లో చంద్రబాబు ఉన్నారు. పార్టీ లో ఎవరు ఉంటారు ?, ఎవరు వెళ్ళిపోతారు ? అన్న దాని విషయంలో చంద్రబాబుకి క్లారిటీ లేకుండా ఉండటంతో టీడీపీ లో ఉన్న ప్రజా ప్రతినిధిలు బాబు మాట వినే పరిస్థితిలో లేకుండా పోయినట్లు సిచువేషన్ మారినట్లు సమాచారం.
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా పార్టీకి వీర విధేయుడిగా ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ పార్టీకి సంబంధించి కీలక నాయకుడిగా రాణించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నట్లు జిల్లాలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. చంద్రబాబు కి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు లోకేష్ సన్నిహితులుగా చెప్పబడే వాళ్లు గుంటూరు జిల్లాలో తనని సైడ్ చేయాలని చూస్తున్నట్లు గల్లా జయదేవ్ అనుకుంటున్నారట.
మరోపక్క పార్టీ హైకమాండ్ నేతలతో సంప్రదింపులు జరపాలని గల్లా జయదేవ్ ప్రయత్నిస్తున్న కానీ సరైన రెస్పాన్స్ అవతల నుండి రావడం లేదట. ఇదే సమయంలో ఇటీవల త్వరలో ఏపీ పార్టీ అధ్యక్ష పదవిని నారా లోకేష్ కి అప్పజెప్పడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో, తన పొలిటికల్ కెరియర్ డేంజర్ జోన్ లో పడుతుందేమో అని గల్లా జయదేవ్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ పార్టీలో చేరడానికి ఆలోచిస్తున్నట్లు, ఢిల్లీ స్థాయిలో ఉండే నేతలతో ఇప్పటికే గల్లా జయదేవ్ టచ్ లో ఉన్నట్లు సమాచారం.