రివర్స్ టెండరింగే కాదు.. గత ప్రభుత్వ హయాంలలో ఏపీఐఐసీ ద్వారా అవసరానికి మించో.. అనుకున్నది చేయకుండానో తీసుకున్న భూములను వెనక్కి తీసుకునే చర్యలు కూడా ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలను, చేస్తున్న చర్యలకు రాజకీయ రంగుపులుముతున్నాయి ప్రతిపక్షాలు. అందుకు వారు ఎంచుకున్న పదం… కక్ష సాధింపు అని!
ఆ సంగతులు అలా ఉంటే.. జగన్ తాజాగా చేపట్టిన చర్యల ఫలితంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన అమర రాజా ఇన్ ఫ్రా కు చెందిన సుమారు 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతోపాటు.. కోర్టు మెట్లు ఎక్కింది! విషయం ఏమిటంటే… గల్లా జయదేవ్ కంపెనీ అయినా అమర రాజా ఇన్ ఫ్రా కు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముని.. జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుక్కు లాక్కుంది! గతంలో అమర రాజా ఇన్ ఫ్రా కంపెనీ విజ్ఞప్తి మేరకు నాటి ప్రభుత్వం 483.27 ఎకరాల భూమిని ఆ కంపెనీకి ఇచ్చింది. అందులో కొంత స్థలంలో మాత్రమే కంపెనీ నిర్మాణం జరిగింది. దీంతో.. అమర రాజా కంపెనీకి ఇచ్చిన 483.27 ఎకరాల భూమి నుంచి.. 253.61 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంది ఏపీ సర్కార్!
దీనికి అమర రాజా కంపెనీ నంచి వస్తున్న ఆరోపణ… తమకు ఏపీఐఐసీ కేటాయించిన భూమిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవటం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే అని! ఇప్పటికే ఆ భూముల్లో రూ.2700 కోట్లు పెట్టుబడి పెట్టాం అని!! కాగా… ఆ భూమిని ఇంకా కంపెనీ వాడలేదని.. చెప్పినట్టు చేయ్యలదని.. అందుకే భూమి వెనక్కు తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతుంది. వందల ఎకరాలు అలా ఖాళీగా పడి ఉండటం కాదు.. సెజ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి భూమి పొంది.. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చలేదు అని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికెళ్లి ఆగుతుందనేది ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉంది!!