పరిపాలనా వికేంధ్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబందించిన బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది.. ఏపీ సర్కార్! ఈ క్రమంలో మండలిలో పెద్దలంతా బిల్లులపై చర్చలు తప్ప అన్నీ చేయడంతో అది కాస్తా పాసవ్వలేదు! ఆ సంగతి అలా ఉంటే… ప్రస్తుత టీడీపీ నేతల ఆర్థిక భవిష్యత్తు అమరవాతిలోని ల్యాండ్స్ పైనే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని వైకాపా నేతలు చేస్తున్న విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ విషయంలో ఇప్పుడు రాజధాని రైతులకు మద్దతు తెలపడానికి గల్లాను ప్రయోగించింది టీడీపీ! గల్లాకు స్థానికంగా మంచి ఫేం ఉండటంతో బాబులు ఇప్పుడు దాన్ని వాడాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది!
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లులలను శాసనమండలిలో మరోసారి విపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది! ఈ క్రమంలో రాజధాని విషయంలో ఉద్యమం రోజులు పెంచుకుంటూ పోతుంది! అలాగే.. రాజధాని విషయంలో ఏపీ సర్కార్ కూడా ముందుకే వెళ్ళాలి అని భావిస్తుంది! ఈ క్రమంలో… రైతులకు ఎంపీ గల్లా జయదేవ్ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తీరును పార్లమెంట్ తో పాటు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు, మానవహక్కులపై ఈ ప్రభుత్వానికి కనీసం లెక్కలేదని ఆరోపించారు.
ఇదే క్రమంలో… రాజధాని గ్రామాల్లో పర్యటించిన గల్లా జయదేవ్… తూళ్ళురు, వెలగపూడి, మందడంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు స్పందించారు! ఉభయ సభలలో సీఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని నమ్మి భూములని అప్పగిస్తే తమని నిలువునా మోసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం కవులు కూడా ఇవ్వకుండా తమని ఇబ్బంది పెడుతున్నారని.. తమ జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయంలో చాలా మంది టీడీపీ నేతల్లాగానే రాజధాని రైతుల నిరసనలకు.. గల్లా కూడా చుట్టం చూపుగా వచ్చి ఫోటోలు దిగి వెళ్లిపోతారా లేక పూర్తిస్థాయిలో వారి నిరసనలకు తోడుంటారా.. వారి దీక్షలకు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతారా లేదా అనేది వేచి చూడాలి!!