కరోనా వైరస్ తెలంగాణలో రోజురోజుకి విపరీతమైన వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇది చాలా ఘోరంగా వ్యాపించి ఉండగా… ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 800 మందికి పైగా కరోనా పేషెంట్లు ఉండగా వారికి తగిన సదుపాయాలు లేక మరియు సిబ్బంది నుండి సహకారం కొరత కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఇప్పటికే డాక్టర్ల కొరత గా ఉందని మరియు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలకు అనుగుణంగా ఇప్పుడు ఆ గాంధీ ఆస్పత్రిలో అటెండర్లు కూడా తగిన సంఖ్యలో లేకపోవడం గమనార్హం.
తాజాగా బయటకు వచ్చిన ఒక విజువల్ ప్రకారం కరుణ బాధితులు గాంధీ ఆస్పత్రిలో ఆరు బయట పక్కన కూర్చొని ఉన్నారు ప్రజలంతా లిఫ్ట్ లోకి వెళ్తున్నారు కానీ వారిని అసలు పట్టించుకోవట్లేదు సరికదా వారి వల్ల ఎంతమందికి వైరస్ సోకే ప్రమాదం ఉందో అర్థం కావడం లేదు.
కరోనా నియంత్రణ విషయంలో అడుగడుగునా విఫలమవుతున్న కేసీఆర్ సర్కార్ ఇకనైనా అలసట వీడి హైదరాబాద్ లో ఎంతో కీలలకమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులు విషయాన్ని పట్టించుకుంటే మంచిదని అందరూ అంటున్నారు.