అమరావతి: మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రభుత్వ విప్ల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నేటి మధ్యాహ్నం 11.49గంటలకు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నది.
మంత్రుల జాబితాలో అవకాశం దక్కని ఎమ్మెల్యేల్లో కొందరిని విప్ పదవులు వరించాయి.
సచివాలయంలోకి తొలి సారిగా అడుగుపెట్టిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే ప్రభుత్వ చీఫ్ విప్గా గండికోట శ్రీకాంత్ రెడ్డి, విప్లుగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కొలుసు పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాస్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్లైన వీరందరూ మంత్రి పదవి ఆశించినప్పటికీ సామాజిక సమతూకం, ప్రాంతీయత తదితర అంశాలతో వీరికి మంత్రిపదవులు దక్కలేదు.