Gang Rape in Guntur: విజయవాడ గుంటూరు మధ్య ఉండే తాడేపల్లిలో బ్లేడ్ బ్యాచ్ దారుణకాండకు పాల్పడింది. కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదీ తీరానికి వెళ్లిన ఓ యువతిని అత్యంత పైసాచికంగా ప్రవర్తించి ఆత్యచారం చేసిన దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనకు కాబోయే భార్యని తీసుకుని నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో తమ సమీపంలోని సీతానగరం పుష్కర ఘాట్ కి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఉండగా.. కొందరు యువకులు వచ్చి యువతీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన యువకుడిని కొట్టి, చెట్టుకి కాటేసారు. అతని ముందే ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటూ ఈ దుర్ఘటన జరిపారు. మొత్తం చీకటి, ఏకాంత వేళా కావడంతో ఎవ్వరికీ తెలియలేదు. మొత్తం అయిన తర్వాత యువతీ, యువకులు ఎలాగోలా ఇంటికి చేరుకొని విషయం చెప్పగా.. ఆ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్త్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Gang Rape in Guntur: బ్లేడ్ బ్యాచ్ పనే.. పోలీసుల దర్యాప్తు..!!
బాధిత యువకుడు ఇచ్చిన సమాచారం, కొన్ని ఆనవాళ్ల మేరకు ఇది కచ్చితంగా అక్కడ ఉండే బ్లేడ్ బ్యాచ్ పని అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ద్వారా మిగిలిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, నిందితులను పట్టుకోడానికి మూడు ప్రత్యేక బృందాలు నియమించినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.