నేటి సమాజంలో స్త్రీ బతికే పరిస్థితే లేదు. ఎంతెత్తుకు ఎదిగినా కాని వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష మాత్రం పోలేదు. వారిపై జరిగే లైంఘిక దాడులు, హత్యలు.. ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. స్త్రీని గౌరవించాలన్న మన సంస్కృతి ఎటు పోయింది. వీరికి బతకనియ్యకుండా చేసే హక్కు ఎవరికుంది. వీరి పట్ల జరిగే దారుణాల మూలంగా నేటి తల్లిదండ్రులు నాకు ఆడబిడ్డ పుట్టకుంటే బాగుండు అనే పరిస్థితి వచ్చింది. అసలు మనుషులు అన్న సంగతి నేటి సమాజం మరిచిపోయినట్టుంది. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పండుముసలి దాకా వారిపై లైంఘిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది మగ మృగాల కారణంగా ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షలు పడుతున్నాయా అంటే… చూస్తూనే ఉన్నాం కదా.. ఎంత మందికి ఉరి శిక్షలు పడ్డాయని..
మరి కొందరైతే లైంఘిక దాడుల పట్ల తమ అభిప్రాయాలను చూస్తేనే తెలుస్తుంటుంది. వారికి స్త్రీల పట్ల ఎంత గౌరవం ఇస్తున్నారనేది. సాధారణ వ్యక్తుల గురించి వదిలేస్తే సమాజాన్ని, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన మన రాజకీయ నాయకులే ఇలా అనడం మరీ దారుణం. లైంఘిక దాడి జరిగితే దానికి అమ్మాయి పద్దతిగా ఉండాలి, అలా లేకపోవడం మూలంగానే ఇవి జరుగుతున్నాయి అని ఒకరంటే..మరొక నాయకుడు ఇలాంటి డ్రస్సులు వేసుకున్నందుకే వారికి ఇలా జరిగిందంటారు. ఇంకొకరు ఐనా అంత అర్థరాత్రి బయటకు ఎందుకు వెళ్లాలి.. ఇంట్లో నే ఉండే ఇలా జరిగేది కాదు కదా అని చెప్పుకొస్తారు మన నాయకులు.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వారికి స్త్రీల పట్ల ఎంత గౌరవముందో..
ఇక పోతే ఎంతో కాలంగా మృగాల నుంచి స్త్రీ బలవుతూనే ఉంది. ఎన్నో చట్టాలను కూడా ప్రభుత్వం తెస్తూనే ఉంది. ఇది కేవలం కొంత కాలం నుంచే చట్టాలు కఠినతరం అయ్యాయన్న సంగతి తెలిసిందే. ప్రియాంక రెడ్డి దాడి నుంచి స్త్రీల పట్ల మరింత కేర్ చూపిస్తుంది మన ప్రభుత్వం. దిశ చట్టం కూడా రీసెంట్ గా తెచ్చిన సంగతి తెలిసిందే..అందరికీ అవగాహన కల్పించడానికి షీ టీం ను కూడా తెచ్చంది. ఐనా ఏం లాభం ఇంలాంటి దారుణాలను మాత్రం ఆపలేకపోతోంది మన ప్రభుత్వం. శిక్షలు వేసినా మాత్రం మార్పు రావడం లేదు. మరి తప్పు ఎవరిది? తప్పు ఎక్కడుంది.
బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మెట్ పల్లి పట్టణంలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకొచ్చింది. అత్యాచారం చేస్తుండగా అందులోని ఒక నిందితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక(14)పై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంపై బాలిక బంధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.