బిగ్ బాస్ సీజన్ 4… తొలి రోజే సూపర్ సక్సెస్ అయింది గొడవలతో. నిజానికి ఏ సీజన్ లో అయినా.. ఏ భాషలో అయినా బిగ్ బాస్ హౌస్ లో సందడి రావాలన్నా.. కాస్తో కూస్తో గొడవలు జరిగి షోకు కాస్తోకూస్తో వ్యూయర్ షిప్ రావాలన్నా కనీసం ఓ వారం అయినా ఆగాలి.
కానీ.. ఈసారి మాత్రం ఏకంగా తొలి రోజే హౌస్ లో రచ్చ స్టార్ట్ అయింది. ఓవైపు సూర్య కిరణ్, మొనల్ గజ్జర్ మధ్య చిన్న గొడవ జరగగా… మరోవైపు కరాటే కళ్యాణి, సుజాత మధ్య మరో గోడవ జరిగింది.
కరాటే కళ్యాణి, సుజాత మధ్య ఓ ఫోన్ కాల్ వివాదం కాస్త ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకునే వరకు వెళ్లింది. కరాటే కళ్యాణి మాత్రం గొంతు పెద్దదిగా చేసి అరవడం హౌస్ మెట్స్ కు కూడా నచ్చలేదు. అదేంటి అలా అని అడిగితే నా గొంతే అంత అని కరాటే కళ్యాణి చెప్పడం హౌస్ మెట్స్ కు కాస్త బాధ కలిగించింది.
అయితే.. ఉదయం నుంచి ఇంటి సభ్యులందరికీ వండి పెట్టి తను చేయగలిగిన సాయం చేసింది కరాటే కళ్యాణి. కానీ.. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. చివరకు తప్పు తన మీద వేసుకొని.. సారీ చెప్పడానికి వచ్చిన సుజాతను పట్టించుకోకుండా.. వద్దు తల్లి.. నీతో నాకు మాటలు వద్దు.. నాకు దూరంగా ఉండు.. అంటూ కళ్యాణి చెప్పి అక్కడి నుంచి వెళ్లి తన బెడ్ పై కూర్చొని ఏడవడంతో హౌస్ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. వెంటనే లాస్య వెళ్లి కళ్యాణిని ఓదార్చి అక్కడి నుంచి కిచెన్ లోకి తీసుకెళ్తుంది.
ఇక.. నామినేషన్ల విషయానికి వస్తే.. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఏడుగురు.
అందులో గంగవ్వ కూడా ఉంది. గంగవ్వను కూడా నామినేట్ చేశారు కొందరు. ఎక్కువ మంది గంగవ్వను నామినేట్ చేసి.. నోయల్ ను సేవ్ చేశారు. అయితే.. గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే.. గంగవ్వ ఈజీగా ఎక్కువ ఓట్లు పొంది సేవ్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు.
ఇక.. ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నామినేట్ అయిన మిగితా ఆరుగురు కంటెస్టెంట్లు సూర్య కిరణ్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, దివి, సుజాత.