విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఈ కుంభకోణం వెనుక గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేల ప్రమేయం ఉందంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం డీజీపీ కే గోపీనాథ్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంకల్ప సిద్ధి కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.
సంకల్ప సిద్ధి కుంభకోణంలో ఎటువంటి ఆధారాలు లేకుండానే తనపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ కేసుతో తనకు గానీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో తనకు సంబంధం ఉందని అధారాలు చూపితే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బచ్చుల అర్జునుడు లపై డీజీపీకి పిర్యాదు చేసినట్లు వంశీ తెలిపారు.
బంగారం షాపులో కాల్పుల కలకలం .. భారీగా నగలు, నగదు అపహరణ ఇలా