ఎంతో సంచలనాత్మక రీతిలో ఏపీ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఫోన్ టాపింగ్ ఆరోపణలను మోపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో ట్యాప్ చేయిస్తోందని ఆయన ఏకంగా ప్రధాని మోదీ కే లేఖ రాశారు.
ఇప్పుడు ఈ విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుని తన ఆరోపణలకు తగ్గట్టు ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని.. తాము వెంటనే యాక్షన్ తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ చిన్న ఆధారం అయినా సరే…. తమ దృష్టికి తీసుకువస్తే ప్రజల గోప్యతను కాపాడుతామని…. అలాగే రాష్ట్ర రక్షణ దేశ రక్షణ కు ఎటువంటి ఆటంకం కలగకుండా తమ చూస్తామని అన్నారు.
ఇప్పటికే బాబు ఎంతో అనాలోచితంగా నిరాధారమైన ఆరోపణలు చేశారు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ సవాల్ లా విసిరిన ఈ ఇండైరెక్ట్ కౌంటర్ కి బాబు ఎలాంటి సమాధానం ఇస్తాడో వేచి చూడాలి.