రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించారు.కాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు సహా 9 శాఖలను తన అధీనంలోనే ఉంచుకున్నారు. వీటిలో ఎక్సైజ్, ప్లానింగ్, సాధారణ పరిపాలన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు కూడా ఉన్నాయి.
అలాగే ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు గ్రామీణాభివృద్ధి, , పబ్లిక్ వర్స్, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఐదు శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ సిఫారసు మేరకు గవర్నర్ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు