గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ ఆధిక్యత నిలుపుకున్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిజెపి వారు ఎంతలా పుంజుకున్నారు ప్రజల్లో తమ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమైంది. ఇదే సమయంలో తెలంగాణ భవన్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేట్ల తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిన డివిజన్లో ఉన్న వారు అందరినీ దూరం పెట్టకుండా అందరూ కలిసి పని చేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల కు సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని.. ఎమోషన్ ఎలక్షన్ జరగడం వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. అయితే ఎంతో ఆసక్తికరంగా కేటీఆర్ జమిలి ఎన్నికలు కేంద్రంలో వచ్చే అవకాశం ఉందని అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడం గమనార్హం.
బిజెపి జమిలి ఎన్నికలకు సంబంధించి సమాచారం ఇచ్చింది కానీ దానికి సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియదు. అయితే ఒక్కసారిగా కేటీఆర్ లాంటి అగ్రనేత ఈ విషయమై టిఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి అన్నారు అంటే… ఇది చాలా సీరియస్ విషయం అని అర్థం అవుతోంది. ఇక గ్రేటర్ ఎన్నికల విషయానికి వస్తే సిట్టింగ్ కార్పొరేటర్ల ను మార్చిన చోటా గెలిచామని చెప్పిన కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఓడిపోయాడని అన్నారు. ఇక్కడే లెక్క తప్పిందని ఆయన ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉందని దీనిని గుణపాఠంగా తీసుకుని అసెంబ్లీ ఎన్నికలకు లోపాలను ససరిదిద్దుకొని అందరూ కలిసి ముందుకు వెళ్లాలని అందరికి పిలుపునిచ్చారు.