గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇద్దరు ఈ సినిమాలో కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్ళీ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందట.
అలాగే తమన్నా రీసెంట్ గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించబోతున్న బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో హిందీలో టబు పోషించిన పాత్రలో తమన్నా నటించబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అలాగే తమన్నా మరో టాక్ షో కి మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించబోతుంది.
తమన్నా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ తిరిగి షూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని యాడ్ ఫిల్మ్ ల షూటింగ్ లో ఉంది. అలాగే త్వరలో సీటిమార్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననుందని సమాచారం. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ అహా కోసం తమన్నాతో ఓ టాక్ షోను ప్లాన్ చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ టాక్ షో షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అంతేకాదు సినిమా సెలబ్రిటీస్ తో రెడీ అవుతున్న ఈ టాక్ షో విజయ దశమి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ కాబోతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!