గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ విస్తృతంగా హామీలను ఇస్తున్నాయి. డిసెంబర్ 1వ తేదీ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్, బీజెపీ, కాంగ్రెస్, ఎంఐఎం నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీజెపీ తన మ్యానిఫెస్టోను ఈ రోజు విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక అంశాలపై ఉచిత హామీలు ఇచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజెపీ మానిఫెస్టోను విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజెపీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో రూపొందించామని తెలిపారు.
దేశం మొత్తానికి 1947 ఆగస్టు 17న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానానిక 1948 సెప్టెంబర్ 17న వచ్చిందనీ, బీజెపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుతామని ఫడ్నవీస్ తెలిపారు. వరద సాయం కింద అర్హులందరికీ రూ .25వేలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫడ్నవీస్ ఆరోపిస్తూ తాము అదికారంలోకి వస్తే సామాన్య ప్రజల సొంటింటి కల నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎం పీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
బీజెపీ హామీలు
- గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్
- పాత బస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ
- పాతబస్తీలోని ప్రతి డివిజన్ కు నాలుగు కోట్లు తగ్గకుండా నిధులు
- వీధి వ్యాపారులకు ఆరోగ్య భీమా
- మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
- మహిళల కోసం కిలో మీటరుకో టాయిలెట్ ఏర్పాటు
- గ్రేటర్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలపై ఇప్పటి వరకూ ఉన్న చలనాలు రద్దు
- ఇంటింటికీ నల్లా కనెక్షన్, 24గంటలు ఉచితంగా మంచినీటి సరఫరా
- కుల వృత్తులకు ఉచిత విద్యుత్, ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తి పన్ను మాఫీ
- పేదలకు వంద యూనిట్లలోపు కరెంటు ఉచిత విద్యుత్
- మహిళల కోసం అయిదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
- విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, వైఫై సౌకర్యం
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు - 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?