(హైదరాాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
హైదరాబాద్ మహానగర పాలకన సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల విడుదల అయ్యింది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారధి మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యుల్ వివరాలు వెల్లడించారు.
రేపటి నుండి (18వ తేదీ) 20వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల స్క్రూటినీ, 22న వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7గంటల నండి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట డిసెంబర్ 3వ తేదీ రీపోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు పలితాల వెల్లడి జరుగుతుంది.
బ్యాలెట్ పద్దతి ద్వారా ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. ఈవీఎంల ద్వారా సాంకేతిక సమస్యలు, వివిధ పార్టీలపై ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసి తెలిపారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్ల విషయంపై ఇప్పటికే పోలీస్, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సమీక్ష జరిపినట్లు ఆయన వెల్లడించారు.
జీహెచ్ఎంసి చైరపర్సన్ జనరల్ (మహిళ)కు రిజర్వు అయిన విషయం తెలిసిందే. గ్రేటర్లో 150 వార్డులు ఉండగా 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38,56,770, మహిళలు 35,46,847, ఇతరులు 669 ఓటర్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పెంచారు. 9248 కేంద్రాల ద్వారా పోలింగ్. గ్రేటర్లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవురపల్లి. ఈ డివిజన్లో 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామంద్రాపురం. ఈ డివిజన్లో అతి తక్కువగా 27,948 మంది ఓటర్లు ఉన్నారు.