GHMC:సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తుంటాయి. అయితే వాటిలో ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కాదు. కొన్ని వార్తలును అయితే ప్రజలు నమ్మి భయపడిపోతున్నారు. కరోనా వచ్చాక చాలా విషయాలు, అసత్య ప్రచారాలు జోరందుకున్నాయి. వాటిని చూసి జనం హడలిపోయారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హైదరాబాద్ లో టూలెట్ బోర్డులు పెట్టే వారికి ఆ వార్తలు గుబులు రేపాయి. టూలెట్ బోర్డు పెట్టినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో టూలెట్ బోర్డులు పెట్టినవారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూలెట్ బోర్డులు పెట్టడం ఎందుకు నేరం అవుతుందని ఫైర్ అవుతున్నారు.
VIRAL: రోడ్డు మీదనే పోలీస్ కి కిస్స్ పెట్టేసింది .. చూస్తోన్న జనానికి మైండ్ బ్లాక్
కరోనా వేళ చాలా మంది ఉన్న ప్రాంతాల్లో ఖాళీ చేసి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ టైంలో అనేక షాపులు, ఇళ్లు ఖాళీ అయిపోయాయి. దీంతో ఖాళీ అయిపోయిన వాటికి టూలెట్ బోర్డులను యజమానులు పెట్టుకున్నారు. అయితే టూలెట్ బోర్డు పెట్టినవారికి జీహెచ్ఎంసి అధికారులు ఫైన్ వేస్తున్నట్లు ఓ వార్త చర్చకు లేవనెత్తింది. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. టూలెట్ బోర్డులు పెడితే ఇబ్బందేమీ లేదని, అయితే అనధికారంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్ రైటింగ్ లు పెడితే కచ్చితంగా జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
Breaking : రామ్ గోపాల్ వర్మ మొదటి లవర్ ఇదిగో !!
సొంత ఇంటికి టూలెట్ బోర్డులు పెట్టడం నేరమేమీ కాదని తెలిపారు. ఆ వార్త ఫేక్ న్యూస్ అని తేల్చారు. తమ ఇల్లకు టూలెట్ బోర్డులు పెట్టుకోవడం నేరమేమీకాదని క్లారిటీ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సొంత ఇళ్లకు టూలెట్ బోర్డు పెట్టినప్పుడు జరిమానాలు విధిస్తారు అంటూ వైరల్ అవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ ఖండించారు. ఒకవేళ ఎవరైనా టూలెట్ బోర్డులనున్న ఇళ్లకు ఫైన్ లు వేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు.