గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఏఎస్ రావునగర్ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి శిరీషా రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి లీడ్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాదించారు. అయితే ఎన్ని ఓట్లతో విజయం సాధించారు అనే దానిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరో డివిజన్లలో కాంగ్రెస్ అధిక్యతలో ఉన్నది.
కాగా ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బ్యాలెట్ ఓట్లతో తొలుత దూసుకు వెళ్లిన బీజెపీ ఆ తరువాత వెనుకబడిపోయింది. అయితే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్, బీజెపీ పోటాపోటీగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం 57 డివిజన్లలో టీఆర్ఎస్, 34 డివిజన్లలో బీజెపీ, 26 డివిజన్లలో ఎంఐఎం అధిక్యతలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే అధిక్యతలో ఉంది.