ఓ బాలిక అపరకాళికాదేవి అవతారం ఎత్తింది. తనపై అఘాయిత్యం చేయడానికి వచ్చిన కామాంధుడిపై కన్నెర్ర చేసి కొడవలితో నరికేసింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నది.
గొర్రెలు మేపేందుకు వెళ్లిన బాలికపై ఓ వ్యక్తి కన్నేశాడు. ఆ బాలికను పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేయబోయాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. అయినప్పటికీ ఆ కామాంధుడు బాలికను వదల్లేదు. దీంతో అక్కడే ఉన్న కొడవలితో ఆ వ్యక్తిని నరికేసింది ఆ బాలిక.
ఆ వ్యక్తి చేయిని నరికేసింది. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికను వదిలేశాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో వెంటనే వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు కామాంధుడి కోసం వెతుకుతున్నారు.
కామాంధుడిని దైర్యంగా ఎదుర్కొని అతడి నుంచి తప్పించుకొని వచ్చిన బాలిక దైర్యాన్ని ఊళ్లోని వాళ్లంతా మెచ్చుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం పెద్దకురప్పల్లే గ్రామంలో చోటు చేసుకున్నది.