కాలం పరుగుల నేపథ్యంలో సమాజంలో చోటుచేసుకున్న మార్పులు కూడా పరుగులు పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంఘటనలు విచిత్రంగా అనిపిస్తుంటాయి.. వాటి గురించిన వాస్తవ విషయాలు తెలిసినప్పుడు. ఆ సమయంలో ఔరా ! అంటూ ముక్కున వేలేసుకోవడం మన వంతు అవుతుంది. ఇలాంటి ఘటన తాజాగా నిర్ధారణ అయింది. అదే లైంగికదాడి కేసు. ఈ కేసుకు సంబంధించి అమ్మాయే… అబ్బాయికి పరిహారం చెల్లించడానికి సిద్ధమైంది. ఇది కొంచెం మీకు విచిత్రంగా అనిపించినా అదే నిజం !
దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై లైంగికదాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల తమిళనాడులోనూ ఇలాంటి కేసే ఒకటి నమోదైంది. రాష్ట్రంలోని ఒకే సమాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు పక్కపక్కనే ఉండేవి. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చెద్దామని పెద్దలు నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తి.. తారా స్థాయికి చేరుకున్నాయి.
దీంతో అబ్బాయి సంతోష్ కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లి ఉంటున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగడం లేదు. అయితే, గొడవలు జరుగుతున్న సమయంలోనే అమ్మాయి గర్భం దాల్చింది. దీనికి కారణం తనను పెళ్లి చేసుకుంటానన్న సంతోషే కారణమని అమ్మాయి కుంటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ పేర్కొన్నాడు. లైంగికదాడి కేసు నేపథ్యంలో సంతోష్ అరెస్టయ్యాడు.
ఇటీవలే సదరు యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. న్యాయస్థానం విచారణ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలు జరిపించాలని ఆదేశించింది. అయితే, ఆ ఫలితాల్లో సంతోష్ డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో కోర్టు ఆ అబ్బాయిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు కేసు బనాయించి, తన జీవితాన్ని నాశనం చేసిందనీ, రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని పరువునష్టం దావా వేశాడు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని అమ్మాయి కుటుంబాన్ని ఆదేశించింది కోర్టు.