మోదీ సర్కారు భారతదేశం లో యువత పెళ్లి వయసు ను పెంచాలన్న గట్టి సంకల్పంతో ఉన్నారు. అందుకు దానికి సంబంధించిన ఒక కమిటీ తన నివేదికను కూడా మోడీకి అందించినట్లు సమాచారం.
’మా ప్రభుత్వం స్త్రీల సంక్షేమం కోసం తీవ్రం గా కృషి చేస్తోంది. అలాగే అమ్మాయిల కనీసం పెళ్లి వయసు ను పెంచేలా ఆలోచిస్తున్నాం. మన దేశ ఆడబిడ్డ లు పోషకాహారం లోపం లేకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉన్నది. అందుకే అమ్మాయిల పెళ్లి వయసు పెంపు కోసం త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నాం.‘ అని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రధాని మోదీ తన ప్రసంగం లో చెప్పిన సంగతి మనకి తెలిసిందే. మొత్తం మీద ఆ కమిటీని ఏర్పాటు చెయ్యగా ప్రస్తుతం ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ’అమ్మాయిల కనీసం పెళ్లి వయసు‘ గురించి ఓ కీలక నివేదిక ను అందించినది.
మన భారత దేశం లాంటి దేశాలలో రాత్రి కి రాత్రే అమ్మాయిల పెళ్లి వయసు ను 21కి పెంచడం అనేది అంత తేలికగా సాధ్యం అయ్యేది కాదు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం దశల వారీగా జరగాలి. అంతేకాకుండా దీనిని అమలు చేసేటందుకు రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ను ఇవ్వాలి. అలాగే, అమ్మాయిల పెళ్లి వయసు 21కి పెరిగితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఇలా చెయ్యడం వలన భారతీయ కుటుంబాలు ఆర్థికం గా బలపడడంతో పాటుగా అమ్మాయిలలో మానసిక పరిపక్వత కూడా పెరగడంతో, తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఒక అవగాహన వస్తుంది. తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మాయిలు వారి వయసు తప్పనిసరిగా 21 ఏళ్లు ఉంటే ఆరోగ్య పరంగానూ ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవట.