స్త్రీ జాతి అంతటిని ఇబ్బంది పెట్టే ఏకైక ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది ఆడవారు పీరియడ్ సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటారు. నాలుగు రోజులపాటు తీవ్ర వేదన అనుభవిస్తారు.మరి కొందరికి పీరియడ్ సమయానికన్నా 5 రోజుల ముందు నుండే బ్రెస్ట్ లో నొప్పి ఒళ్ళు నొప్పులు నీరసం కాళ్ళు లాగడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది కి ఆ సమయం లో వచ్చే నొప్పికి బిడ్డ పుట్టేటప్పుడు వచ్చే నొప్పికి పెద్ద తేడాఉండదు.. అంత నొప్పి కి గురవుతారు.
ఇలా ఈ బాధ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. చాలామంది ఆడవారిలో రుతుస్రావం మొదలయ్యాక పొత్తి కడుపులో నొప్పి రావడం కాళ్ళు లాగడం నడుమునొప్పి వాంతులు లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ సాధారణం గా నెలనెలా జరుగుతూ ఉంటుంది. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాతనెమ్మదిగా తగ్గుతుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ల స్థాయిలు తగ్గడం వల్ల కడుపులో నొప్పి, మాటిమాటికీ కోపం రావడం, చికాకు పెరిగిపోతూఉంటాయి.
హార్మోన్ మార్పుల కారణంగా మూడ్ కూడా వెంట వెంటనే మారుతుంది.డిప్రెస్ అయిపోతూ ఉంటారు. చాల చాల చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే ఇది ఆడవారికి చాల సహజమైన విషయంఅయినప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం చాల అవసరం. దానికి తోడు ఇంటిపని, చేసుకుని ఉడ్జ్యోగాలకు వెళ్లే వారి పరిస్థితి మరి ఘోరం గా ఉంటుంది. ఆ సమయం లో ఆమెకు పనుల్లో సహాయం చేయండి.పిల్లలను చూసుకోండి ఆమెకి విశ్రాంతి ఇవ్వండి. ఆమె గురించి ఆలోచించండి.
ప్రేమగా ఉండండి.. ఆమె చిరాకును అర్ధం చేసుకోండి..అది ఆడవాళ్ళ అందరికి మాములేగా నీకు ఏమి కొత్తకాదుగా అందరికీలేని బాధ నీకు ఒక్కదానికే ఉందా అనే మాటలు వాడకండి. ఎందుకంటే ఆ సమయం లో ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క స్థాయి లో ఉంటుంది.మీరు చూపించే ప్రేమ లోనేవారు ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆ మూడు రోజులు ఆమెకి పూర్తిగా విశ్రాంతి ని ఇవ్వండి. ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయండి.