పనాజి: గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.
కొద్దిసేపటి క్రితమే మనోహర్ పారికర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందనీ, వైద్యులు వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తున్నారనీ సిఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) ట్విట్టర్ లో పేర్కొంది.
మనోహర్ పారికర్ క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో చికిత్స పొందారు. దిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబయిలోనూ ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే గతనెలలో మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.