ఈ భూ ప్రపంచం గురించి ఎన్ని విషయాలు తెలిసినా.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రకృతి ఎన్నో అరుదైన, అద్భుతమైన జీవులకు నిదర్శనం. వాటికి వుండే ప్రత్యేకత వాటికే ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఈ జీవులు వింతైన జీవులకు జన్మనిస్తుంటాయి. అలాంటి ఘటనలు ఇప్పటివరకూ చాలానే చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో అందరికీ గుర్తొచ్చేది బ్రహ్మంగారు రాసిన “కాలజ్ఞానం”. అందులో భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలను గురించి ప్రస్తావించారు. అలాంటివి ఇటీవలి కాలంలో చాలానే వెలుగుచూశాయి.
అయితే, ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు చాలా మంది ఇది దేవుడి మహిమ అంటూ.. పలు దేవుళ్ల రూపాలతో పోలుస్తూ.. పూజలు చేసిన సంఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఇలాంటి వార్తే.. సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ మేక వింతైన జీవికి జన్మనిచ్చింది. దాని చూస్తే.. అయ్య బాబోయ్ ఇదేం జీవి ! ఇలా ఉంది అంటూ ఆశ్చర్య పోతారు. ఆ వింతైన జీవి ఎలా ఉంది అంటే.. కోతి ముఖంతో పోలి ఉంది. శరీరం కూడా అలానే ఉంది.
అయితే, మేకకు పుట్టిన ఈ వింతైన జీవిని చూసిన స్థానిక ప్రజలు మొదట ఆశ్చర్యంతో పాటు షాక్కు గురయ్యారు. అయితే, దీని నుంచి కోలుకున్న తర్వాత ఆ జీవిని హనుమంతునిగా భావించి.. ఆ వింతైన జీవికి పూజలు చేస్తున్నారు. దీంతో అక్కడి వాతారణం తెగ సందడిగా మారిపోయింది. అయితే, ఇది జరిగిన కొద్ది సమయంలోనే.. ఆ వింతైన జీవి మరణించింది. ఇది కాన్పూర్ లోని జహంగీరాబాద్లోని సీతారామ్ అనే వ్యక్తి నివాసంలో చోటుచేసుకుంది.
ఇటీవల తెలంగాణలోనూ ఓ గొర్రె వింత జంతుకువు జన్మనిచ్చింది. మెదక్ జిల్లా ర్యాలమడుగు గ్రామంలో ఒక గొర్రెకు వింత జీవి పుట్టింది. ఆ జీవికి.. గొర్రెకు ఎలాంటి పోలికలేకపోగా.. రూపం మరి విచిత్రంగా చింపాజీల ఉంది. కాళ్లు మాత్రమే గొర్రెకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఆ వింత జీవికి జన్మనిచ్చిన ఆ గొర్రె, పుట్టిన వింత జంతువు కూడా చనిపోయింది. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాతో పాటు వార్తల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది.