surgeon: నిబంధనలకు విరుద్ధంగా కేవలం 7 గంటల్లో ఏకంగా 101 మంది మహిళలకు ఒకే రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వివాదస్పదంగా మారాడు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడు. ఆగస్టు 27న సుర్గుజా జిల్లాలోని మైన్ పట్ లో ఉన్న నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా మధ్యాహ్నాం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ శిబిరం జరిగింది. డాక్టర్ జిబ్నస్ ఎక్క అనే ప్రభుత్వ వైద్యుడు అక్కడికి వచ్చిన 101 మంది మహిళలకు ఒకే రోజు తానొక్కడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసాడు. దీంతో ఒకే వైద్యుడు ఒకేరోజు అన్ని ఆపరేషన్లు చేసినందుకు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఇంత మందికి ఆపేరేషన్లు చేశారని ప్రశ్నిస్తున్నారు.
YS Sharmila: తెలంగాణలో సీఎం కేసిఆర్ అసలు లక్ష్యాన్ని బయటపెట్టిన వైఎస్ షర్మిల..!!
ఇంతకముందు కూడా ఇలాగే ఛత్తీస్ఘడ్ లో ఆపరేషన్లు చేయించుకున్న 83 మంది మహిళలల్లో 13 మంది అనారోగ్యానికి గురై మృతి చెందిన సంఘటన జరగడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. దీని పై జిల్లా వైద్యాధికారి ఆ వైద్యుడికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసి విచారణకు ఆదేశించారు.
Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!
వాస్తవానికి ఒక వైద్యుడు ఒకే రోజులో 30 ఆపరేషన్లు చేయాల్సి ఉండగా డాక్టర్ జిబ్నస్ ఏకంగా 101 మంది మహిళలకు ఆపరేషన్ లు చేసాడు. దీంతో ఈ విషయం కాస్త వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో వైద్యుడుని వివరణ కోరగా శిబిరంలో ఆ రోజు సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు తాము మళ్ళీ మళ్ళీ రాలేమని ఒత్తిడి చేస్తేనే ఆపరేషన్ లు చేశానని.. అయినా తనకి ప్రభుత్వ నిబంధనల గురించి తెలుసునని వారి కోరిక మేరకే అలా చేశానని స్పందించాడు.
Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!