హైదరాబాద్ చారిత్రాత్మకతకు అద్దం పట్టే విధంగా గోల్కొండ కోట మనకు కనబడుతుంది. ఈ గోల్కొండ హైదరాబాద్ చరిత్రను మనకు తెలియజేసేలా కాకతీయుల పరిపాలన వైభవానికి ప్రతీకగా నిలబడతాయి. అనతికాలంలోనే కుతుబ్షాహీల రాజధానిగా అభివృద్ధి చెందింది.కుతుబ్షాహీల తరువాత రాజ్యాధికారం చేతపట్టిన అసఫ్ జాహీలు ఆధునిక హైదరాబాద్ కు శ్రీకారం చుట్టారు.ఇప్పటికే సాలార్జంగ్ మ్యూజియం, నిజామ్స్ మ్యూజియాలలో అలాంటి అద్భుతమైన వస్తువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి స్మారక చిహ్నాలను నిర్మించేందుకు గోల్కొండ సమాధుల పక్కనున్న భూగర్భంలో” ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ “పేరుతో తాజాగా స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఆధునిక ప్రదర్శనశాల ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యాయి. ఈ భూగర్భ ప్రదర్శనశాల ఒకప్పటి చారిత్రక కట్టడాలను తలపించే విధంగా సుమారు 45 కోట్ల రూపాయలతో భూగర్భ ప్రదర్శనశాల ముస్తాబు కానున్నట్లు తెలిపారు.
ఈ భూగర్భ భాగంలో నిర్మించే ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ లో చరిత్ర పుస్తకాలతో ఒక లైబ్రరీని నిర్మించనున్నారు. అంతేకాకుండా అప్పటి రాజుల జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలను, ఏర్పాటు చేయనున్నారు. ‘సెవన్ టూంబ్స్’గా పేరొందిన కుతుబ్ షాహీ సమాధుల చెంత ఇది మరో చారిత్రక కట్టడాన్ని తలపించనుంది. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దక్కన్ హెరిటేజ్ పార్క్ వద్ద 6,500 చదరపు అడుగుల పరిధిలో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు.
సుమారు 1,200 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓరియంటేషన్ కోర్టు, పిల్లల గ్యాలరీలు, స్క్రీనింగ్ సెంటర్లు, సావనీర్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణ. కొన్ని న్యాయపరమైన వివాదాలు దృష్ట ఈ నిర్మాణ పనులు ఆగిపోయాయి.న్యాయస్థానం నుంచి సానుకూలమైన తీర్పు ఏర్పడితే తొందరలోనే ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రాజెక్టు ప్రతినిధి తెలిపారు.