Gold Excavation: మన దేశంలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా దొరికే జాబితాలో Andhra Pradesh ఐదో స్థానంలో ఉంది. ప్రధమ నాలుగు స్థానాల్లో బీహార్ రాజస్ధాన్ కర్నాటక పశ్చిమబెంగాల్ ఉండగా ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చాలా సంవత్సరాల తరువాత మళ్ళి ఇపుడు ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో బంగారం తవ్వకాల Gold excavation కొరకు ప్రయత్నాలు మొదలయ్యాయనే చెప్పాలి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ ఎన్ఎండీసీ చాలా రోజుల తర్వాత తిరిగి రాయలసీమలో బంగారం తవ్వకాలకు ప్రయత్నాలు చేపడుతుంది.
అయితే ముందుగా ఎన్ఎండీసీ ఇక్కడ తవ్వకాలు ప్రారంభిస్తే ఎంత వరకు బంగారం దొరకవచ్చు అలాగే అది ఎంతవరకు గిట్టుబాటు అయ్యే వ్యవహారం అనే అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇక్కడ తవ్వకాలు ప్రారంభం అవుతాయట. గతంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రామగిరిలో బంగారం మైనింగ్ జరిగింది.
అయితే అప్పట్లో ఇక్కడ బంగారం ధరలు చాలా తక్కువగా ఉండేవట. మొత్తం బంగారం తవ్వి తీసినందుకు అయిన ఖర్చుతో పోలిస్తే ఆ బంగారం అమ్మితే వచ్చే లాభం బాగా తక్కువగా ఉండేదట. అందుకే ఇక్కడ గోల్డ్ మైనింగ్ ను అప్పటిలో నిలిపేశారు.
ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మళ్ళి గోల్డ్ మైనింగ్ చేసి ఖనిజాన్ని వెలికితీసి ఎగుమతులు చెయ్యాలని ఎన్ఎండీసీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రామగిరిలో ఈ బంగారపు గనుల తవ్వకాలను ప్రారంభించాలంటే ఏకంగా వందల అడుగుల లోతుకు తవ్వకాలు జరపాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతి లభించి అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో రాయలసీమలో ఈ బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం అవుతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.