గత వారం రోజులుగా బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు పసిడి వెలవెలపోయింది. బంగారం ధర బాగా పడిపోగా…. ఆ బాటలోనే వెండి కూడా నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉండడం గమనార్హం. నిన్న ఆల్ టైం గరిష్ఠ స్థాయిని తాకి అటువైపు తగ్గిన పసిడి ఈరోజు కూడా వెలవెలబోయింది .వరుసగా రెండో రోజు దారుణంగా పడిపోయిన బంగారం ధర తో స్టాక్ మార్కెట్ల పై ఎఫెక్ట్ పడింది.
మొన్నటి వరకు పది గ్రాముల బంగారం ధర 50,374 రూపాయలు ఉండగా ఈరోజు 48,074 రూపాయలకు క్షీణించింది. గత సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర ఒకనొక సమయంలో రూ.48,589కి దిగజారిగా.. ఆ రేటుతో పోలిస్తే ఇప్పటికి ఇంకా 516 రూపాయలు తగ్గిందనే చెప్పొచ్చు.
బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర 0.14 శాతం క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.47,721కు పడిపోయింది. ఇకపోతే ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్కు రూ.48,600/రూ.50,000 వద్ద గట్టి నిరోధం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. అలాగే రూ.46,550 వద్ద మద్దతు లభిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?