కరోనా కష్ట కాలంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం పసిడి ధర సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర అనగా 10 గ్రాములు రూ 50 వేలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 45,000 పలికింది.
ఇక బంగారం బాటలోనే వెండి ధర కూడా నడవడం గమనార్హం. కేజీ సిల్వర్ 48,800 రూపాయలకు ఎగబాకింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఇంకా పసిడి ధర పెరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండటంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని ఊహాగానాల నేపథ్యంలో లోహాలకు డిమాండ్ పెరిగింది. సంక్షోభ కాలంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఈక్విటీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు ఎగబాకుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?