Gold Thief: ఏ దొంగ అయినా దొంగతనం చేస్తే ఎవ్వరికి తెలియని ప్రదేశంలోనూ దాచిపెడతాడు.. అయితే ఈ దొంగ మాత్రం వినూత్నంగా ట్రై చేశాడు.. ఒక దొంగ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది.. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
HBD Nikhil: నిఖిల్ బర్త్ డే స్పెషల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్ అదుర్స్..!!
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సూళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మార్చి నెలలో సూళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల షాప్ లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో రూ.7.50 లక్షల విలువచేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేల నగదు దొంగిలించారు. ఈ కేసులో పోలీసులు ఐదు రోజుల కిందట తంగచ్చయన్ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.. శిబు తన దగ్గర ఉన్న 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. కాసేపటికే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతనిని పోలీసులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు ఎక్స్రే తియ్యగా కడుపులో ఉంగరాలు ఉన్నాయని తేలింది. దీంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. వైద్యులు అతని పొట్టకోసి 25 చిన్న ఉంగరాలను బయటకు తీశారు. ప్రస్తుతం దొంగ ఆరోగ్యం బాగానే ఉంది. అయితే అసలు దొంగ ఎలా ఉంగరాలను మింగడా అని అనుకుంటున్నారా.. ఐస్ క్రీమ్ తో పాటు ఆ ఉంగరాలను మింగినట్లు దొంగ వెల్లడించాడు.