గోల్డెన్ మిల్క్.. ఎప్పుడైనా విన్నారా ఈ పేరును. పసుపు పాలకి మరో పేరే గోల్డెన్ మిల్క్. ఈ పాలు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అంతేకాకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ఆరోగ్య రహస్యం పసుపు పాలే అంటారు. అయితే ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి.. దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు శరీరానికి కావాల్సిన పోషకాలుతో పాటు మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతుంది. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెదడులోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు మూడు గ్లాసుల పాలు తాగే వారు వ్యాదులకు దూరంగా ఉంటారని పరిశోధనలు తెలిపాయి. అటువంటి పాలకు కాస్త మంచి పసుపు జోడిస్తే ఆరోగ్యానికి బోనస్ లభించినట్లే. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధ గుణాలు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇలా తయారు చేసుకోవాలి :
చెంచాడు పసుపు గ్లాసుడు వేడి వేడి పాలలో కలుపుకొని ప్రతిరోజు తీసుకోవాలి. కావాలంటే కొంచెం తేనె, మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు.
ప్రయోజనాలు ఇవి:
అజీర్తి చాతిలో మంట వంటివి ఈ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. కీళ్లనొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటుని కూడా నియంత్రణలో ఉంచుతాయి. జలుబు, జ్వరం, చర్మవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందువలన రోగనిరోధక శక్తిని బలోపేతం పెంచుతుంది. జీవక్రియ పనితీరు మెరుగుపరుస్తుంది. దీని వలన బరువు కూడా తగ్గుతారు. అంతే కాకుండా ఇది క్యాన్సర్ వారిని పడకుండా భారీనా పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ఈ పాలను రోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది. కాలేయంలో చేరే విష కారకాలను హరిస్తుంది. పసుపు పాలు వైరల్ దాడి నుంచి రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చకామెర్ల లాంటి వ్యాధులు రావు. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ త్వరితగతిన రెట్టింపు అవకుండా పసుపు నియంత్రిస్తుంది.