డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ, “సాహో” లాంటి భారీ సినిమాల తర్వాత “రాధే శ్యామ్” వస్తుండడంతో దేశ వ్యాప్తంగా.. అలాగే అన్ని చిత్ర పరిశ్రలలో బాగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ ప్రారంభం అయి చాలా కాలమవుతున్నప్పటికి కేవలం టైటిల్ పోస్టర్ తో కూడిన ప్రభాస్, పూజ హెగ్డే ల ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ గాని, ప్రేక్షకులకి గాని ఇప్పటి వరకు క్యూరియాసిటీ ని పెంచిన విషయం ఏదైనా ఉందంటే ఫస్ట్ లుక్ పోస్టర్ 5 భాషల్లో రిలీజ్ చేయడమే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట.
వచ్చే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజు “రాధే శ్యామ్” సినిమా నుంచి ఫ్యాన్స్ థ్రిల్లయ్యే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే రాధే శ్యామ్ యూనిట్ టీజర్ ను కట్ చేసి తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ కు జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్టు సమాచారం.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైయంతి మూవీస్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ కూడా తయారవుతున్నాయని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ లేదా ఎం.ఎం.కీరవాణి సంగీతమందించే అవకాశాలున్నాయి.
దర్శక దిగ్గజం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ అన్న టైటిల్ తో మరో భారీ సినిమా చేస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా కనిపించబోతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది.