NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

రూ. 900 కోట్లు… క‌రోనా వ్యాక్సిన్ ఎలా ఇస్తారంటే….

భార‌త‌దేశంలో ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌పైనే ప‌డింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దేశంలోని వివిధ వ్యాక్సిన్ త‌యారీ కేంద్రాల‌ను సంద‌ర్శించిన నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అనే ఉత్కంఠ , ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

 

ఇలాంటి త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారత ప్రభుత్వం మిషన్‌ కోవిడ్‌ సురక్ష- ఇండియన్‌ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ కోసం రూ.900 కోట్లతో మూడవ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ విభాగానికి (DBT) ఈ గ్రాంట్‌ అందించనున్నారు.

క‌రోనా వ్యాక్సిన్ కోసం …

కేంద్ర‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (శాస్త్ర సాంకేతిక విజ్ఞాన) మంత్రిత్వశాఖ బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఛైర్‌పర్సన్‌ బిరాక్‌ డాక్టర్‌ రేణుస్వరూప్ మీడియాతో మాట్లాడుతూ, క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌న్నారు. మిషన్‌ కోవిడ్‌ సురక్ష మన దేశానికి స్వదేశీ, సరసమైన ధరలకు వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. చికిత్స విధానం అభివృద్ధి కోసం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ వేగవంతమైన ఉత్పత్తికి అవసరమైన నిధుల వనరులను అందిస్తోంది. 5-6 వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని వివ‌రించారు.

12 నెల‌లు … 900 కోట్లు…

ప్రీ క్లినికల్‌, క్లినికల్‌ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడం తో పాటు ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న లేదా క్లినికల్‌ దశలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ లైసెన్స్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ సైట్‌లను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రయోగశాలలు, అధ్యయనాలకు అనువైన సౌకర్యాలు, ఉత్పత్తి సౌకర్యాలు,ఇతర పరీక్ష సౌకర్యాలను బలోపేతం చేయడంలో భాగంగా కోవిడ్‌ సురక్ష మిషన్‌ మొదటి దశకు 12 నెలల కాలానికి రూ.900 కోట్లు కోటాయించనున్నారు.

విదేశీ టీకాలు సైతం….

ఇదిలాఉండ‌గా, ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ టీకాలు సత్ఫలితాలిస్తుండడంతో భారత్‌లోనూ ఆయా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పుణెకు చెందిన సీరమ్‌ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై ఒప్పందాలు కుదుర్చుకుంది. 3, 4 నెలల్లో ఈ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సీరమ్‌ సీఈవో అదర్‌ పూణావాలా వెల్లడించారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ విషయంలోనూ భారత్‌ చర్చలు జరుపుతోందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్, వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌) సాంకేతికతను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

author avatar
sridhar

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?